Wednesday, May 28, 2008

చికెన్ పిజ్జా




నేను ఇక్కడ ఎప్పుడు పిజ్జా తిన్నా దానికి ఇండియా పిజ్జా టేస్ట్ రాదు. అందుకని స్పయిసినెస్ కోసం ఈ సారి నేను నా మిగిలిపోయిన చికెన్ కూరతో పిజ్జా తయారు చేసాను.

దీనికి కావలిసినవి:

అడుగు పిజ్జా బేస్ కోసం:

2 కపులు మైదా
1 స్పూన్ ఈస్ట్
1 స్పూన్ ఊప్పు
గోరువెచ్చని నీల్లు
ఫిజ్జా పైబాగం కొరకు:

1/4 కప్ మిగిలిపోయిన చికెన్ కూర
1 చిన్న వుల్లిపాయ (ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
కొద్దిగా కెప్సికం ముక్కలు
200 గ్రా. ఛీస్
టమటొ సాస్
మిరియాల పొడి.
ఈస్ట్ ని నీల్లలో కలిపి మూత పెట్టి 15ని. పాటు వుంచాలి.
తరువాత దీనికి మైదా,ఊప్పు చేర్చి పూరిపిండి మాదిరిగ కలిపి ఒక గంట పాటు మూత పెట్టి నాన నివ్వాలి. తరువాత ఈ పిండి రెంట్టింపు కావడం మనం గమనించవచ్చు.
ఒవెన్ ని 170 డి.సె. లో పెట్టి అన్ చేసుకోవాలి.

ఇలోపు నానబెట్టిన పిండిని చపాతి కర్ర సాయం తో కొంచం మందం గా, వెడల్పు గా చేసుకుని ఒవెన్ లో పెట్టి 10ని. వుంచాలి.

ఇలోపు చికెన్ కూర లొ చికెన్ ముక్కలని పొర్క్ సాయం తో చిన్న ముక్కలు గా చేసుకోవాలి. తరువాత ఒవెన్ నుండి పిజ్జ బేస్ బయటకి తీసి , దానిపై టమటొ సాస్ రాసి చికెన్ కూర స్ప్రెడ్ చేసి, దానిపైన చీస్ చల్లు కొని, వుల్లిపాయ ముక్కలు, కెప్సికం ముక్కలు వేసి, మిరియల పొడి కొద్దిగా చల్లు కొని తిరిగి ఒవెన్ లో పెట్టి 5 నుండి 10 నిముషాలు పాటు వుంచి చీస్ మాడకుండా బయటకి తీసేయాలి.

Saturday, May 3, 2008

అవొకడొ మిల్క్ షేక్


అవొకడొ - 1
పాలు - 1 కప్
నీల్లు - 1 కప్
పంచదార - 2 స్పూన్లు
ఐస్ ముక్కలు

అవొకడొ రెండు చెక్కలు గా కోసి గింజ తీసివేసి, స్పూన్ సహాయముతో అవొకడొ గుంజు తీయాలి. మిక్సీజార్ లో అవొకడొ గుంజు, పంచదార, పాలు, నీల్లు, ఐస్ ముక్కలు వేసి రెండు నిముషాలు మిక్సీ కొట్టి, ఈ మిల్క్ షేక్ ని గ్లాస్ లో పోసుకోంటే సరి.

పునుకులు మరియు బోండాలు

ఈ రోజు వివిధ రకలైన పునుకులు, బోడాలు గూరించి చెప్పుకుందాము.
1.బోండాలు


విధానము: 1


మినప పప్పు : 1కప్

ఉల్లిపాయ : 1

పర్చిమిర్చి : 2

అల్లం : 1/2"

వంటసోడ

ఉప్పు

వంటనూని


మినప పప్పు సుమారు 5 గంటల పాటు నీటిలో నానబెట్టి కడిగి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బి 6 గంటల పాటు పులవబెట్టుకోవాలి. తరువత దీనికి ఉలిపాయ, పర్చిమిర్చి, అల్లం ముక్కలు మరియు వంటసోడ,ఉప్పు కలిపాలి. స్టవ్ మీద ముకుడి లో నూని వేడి చేసి, చేతితో కొంచం పిండి తీసుకొని వుండలు గా నూనిళొ వేసుకొని, వేగనిచ్చి తిసేయాలి.



విధానము: 2


మినప పిండి : 1.5కప్

బియ్యం పిండి : 1/2కప్

ఉప్పు

వంటనూని
మినప పిండి, బియ్యం పిండి ఉప్పు కలిపి నీటిలో నానబెట్టి 6 గంటల పాటు వుంచుకోవాలి. తరువాత స్టవ్ మీద ముకుడి లో నూని వేడి చేసి, చేతితో కొంచం పిండి తీసుకొని వుండలు గా నూనిలొ వేసుకొని, వేగనిచ్చి తీసేయాలి.




మైసూర్ బజ్జి:


విధానము: 1

మైదా : 2కప్

పెరుగు : 1కప్

వంటసోడ

ఉప్పు

వంటనూని


మైదా, పెరుగు, ఉప్పు కలిపి 6 గంటల పాటు నానబెట్టి వుంచుకోవాలి. తరువాత స్టవ్ మీద ముకుడి లో నూని వేడి చేసి, చేతితో కొంచం పిండి తీసుకొని వుండలు గా నూనిలొ వేసుకొని, వేగనిచ్చి తీసేయాలి.



విధానము: 2


బొంబాయి రవ్వ : 2కప్

పెరుగు : 1కప్

వంటసోడ

ఉప్పు

వంటనూని


బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు కలిపి 6 గంటల పాటు నానబెట్టి వుంచుకోవాలి. తరువాత స్టవ్ మీద ముకుడి లో నూని వేడి చేసి, చేతితో కొంచం పిండి తీసుకొని వుండలు గా నూనిలొ వేసుకొని, వేగనిచ్చి తీసేయాలి.



పునుకులు :



దోశ పిండికి మైదా,ఉల్లి, పర్చిమిర్చి,అల్లం ముక్కలు కలుపుకొని,స్టవ్ మీద ముకుడి లో నూని వేడి చేసి, చేతితో కొంచం పిండి తీసుకొని వుండలు గా నూనిలొ వేసుకొని, వేగనిచ్చి తీసేయాలి.


పెసర పునుకులు :


పెసర పప్పు : 1కప్

ఉల్లిపాయ : 1

పర్చిమిర్చి : 2

అల్లం : 1/2"

ఉప్పు

వంటనూని


పెసర పప్పు సుమారు 2 గంటల పాటు నీటిలో నానబెట్టి కడిగి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బి ,దీనికి ఉలిపాయ, పర్చిమిర్చి, అల్లం ముక్కలు మరియు వంటసోడ,ఉప్పు కలిపాలి. స్టవ్ మీద ముకుడి లో నూని వేడి చేసి, చేతితో కొంచం పిండి తీసుకొని వుండలు గా నూనిలొ వేసుకొని, వేగనిచ్చి తిసేయాలి.

బెంగుళూర్ వంకాయ కూర

కావలిసినవి:

బెంగుళూర్ వంకాయలు - 3
ఉల్లిపాయ - 1
పర్చిమిర్చి - 5
దనియాల పొడి - 1 స్పూన్
మంచినూని - 1 పెద్ద స్పూన్
ఉప్పు
పసుపు

తాళింపుకి:
జీలకర్ర,ఆవాలు,మినప పప్పు, శనగపప్పు, ఎండిమిరపకాయ, కరివేపాకు.


  • ఉల్లిపాయ,పర్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.

  • బెంగుళూర్ వంకాయ తొక్క చెక్కి,రెండు బాగలు గా చేసుకొని దానిలో గింజ తొలగించి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలని కొంచం ఉప్పు వెసి చేతితో మెత్తగా నలిపి, ముక్కల నుండి నీరు తీసివేయాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద కడై లో నూనె పోసుకొని స్టవ్ మీద వేడి చేసి దానిలో తాళింపు సరుకులు వేసి, అవి వేగేక ఉల్లిపాయ, పర్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.


  • ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేక బెంగుళూర్ వంకాయ ముక్కలు వేసి కలిపి 5ని. మూతపెట్టి వుంచాలి.


  • ఇప్పుడు దనియాల పొడి, పసుపు ఉప్పు వేసి బగా కలిపి మూత పెట్టి, స్టవ్ సింలో పెట్టి వుడకనిస్తే చాలు. నీరు కలపనవసరం లేదు.




Wednesday, April 30, 2008

మినపరొట్టి / దిబ్బ రొట్టి



ఇది ప్రాచీన ఆంధ్రా వంటకము అని చెప్పుకోవచ్చు. ఈ రొట్టె చేయడం చాలా శులభం మరియు ఎంతో టైం కేటాయించాలిసిన అవసరం కుడా లేదు.




మినపొప్పు - 1 కప్


బియ్యం నూక- 1.5 కప్


నూనే - 2 స్పూన్లు


ఉప్పు






  • మినపొప్పుని సుమారు 6 గంటల సేపు, బియ్యం నూకని 2 గంటల సేపు నీటిలో వేరు వేరుగా నానపెట్టుకొని వుంచుకొవాలి.


  • పప్పు నానిన తరువాత గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని దానిలో, ఉప్పు, నానపెట్టుకున్న నూకని నీటినుంచి వేరు చేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 8 గంటలపాటు నాననివ్వాలి.


  • ఒక వెడల్పాటి దలసరి కడై (ముకుడు మాదిరిగా) లో నూనే తీసుకొని పొయ్యమీద వేడి చేసి, ఈ పిండి మొత్తం దానిలో వేసి కడై కి మూతపెత్తుకొని స్టవ్ సింలో పెట్టి వుంచాలి.


  • రొట్టె ముదురు కొదుమ రంగులొకి వచ్చి, కాలిన వాసన వస్తుండగా తిరగేసి మరో పదినిమషాలు అదే మాదిరిగా మూతపెట్టి సింలో వుంచి స్టవ్ కట్టేసుకొవాలి. ఒక పదినిమషాలు మగ్గనిచ్చి ముక్కలుగా కోసుకొని చట్ని తొ తింటే బావుంటుంది.

Friday, April 25, 2008

రొయ్యలు మునకాడ కూర


3/4 కప్ తొక్క తీసి శుబ్రపరిచిన రొయ్యలు.



1 కప్ మునగకాడ ముక్కలు



1 పెద్ద టమాటొ (ముక్కలు గా కోసుకోవాలి)



2 వుల్లిపాయ్లు (ముక్కలు గా కోసుకోవాలి)



1 స్పూన్ కారం



1 స్పూన్ అల్లం,వెళ్ళుల్లి ముద్ద



4 పర్చి మిరపకాయలు



5 లవంగాలు



2 స్పూన్ దనియాల పొడి



1 పెద్ద స్పూన్ నూని



ఉప్పు



  • స్టవ్ మీద కడైలో నూనే పోసి వేడి చేసి దానిలో లవంగాలు, వుల్లిపాయముక్కలు,పర్చిమిర్చి అల్లం & వెల్లుళ్ళి ముద్ద వేసి వేగించాలి.

  • వుల్లిపాయముక్కలు వేగేక దానిలో కారం, దానియల పొడి వేసి ఒక సారి వేగనిచ్చి తరువాత మునకాడ ముక్కలు, టమటొ ముక్కలు వేసి రెండు నిముషాలు వేగనిచ్చి దనిలో రోయ్యలు కలిపి మూత పెట్టి 5ని. మగ్గనివ్వాలి.

  • తరువాత ఉప్పు,1 కప్ నీల్లు జతచేసి మూతపెట్టి, నీరు ఇంకేవరకు వుడక నివ్వాలి.

రొయ్యలకి బదులుగా జీడి పొప్పు వేసి కూడా ఈ కూర వండుకొవచ్చు.(జీడిపొప్పుని 15 ని. నీటిలో నాన బెట్టాలి)

Tuesday, April 22, 2008

ఎగ్ దొసె


గుడ్డు - 1

దొసేపిండి -2

గరిటెలు

ఉప్పు

నూనే

మిరియాల పొడి



స్టవ్ మీద పెనం వేడి చేసుకోని దాని మీదా దొసె పిండితొ దొస మదిరిగా వేసుకొని, గుడ్డు పగలగొట్టి సొన దొసే మీద వేసుకొని దొసే చుట్టూ నూనే వేసి దొస పైన మిరియాల పొడి,వుప్పు చల్లు కొవాలి. ఒక నిమషం కాలనిస్తే చాలు మీ పిల్లల లంచి బాక్స్ లోకి ఎగ్ దొసె రడీ!


దొసె పిండి తయారి విధానము:

1 కప్ మినపపప్పు కి 2 కప్లు బియ్యం కలిపి 6 గంటలు నాననిచ్చి, గ్రైండర్ లో వేసి నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని 8 గంటలు వరకు నానబెట్టుకోవాలి.